క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సౌరభ్

565చూసినవారు
క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సౌరభ్
క్రికెట్‌ కెరీర్‌కు ఝార్ఖండ్‌ బ్యాటర్‌ సౌరభ్‌ తివారి రిటైర్‌మెంట్‌ ప్రకటించనున్నారు. ఈ నెల 16న రాజస్థాన్‌తో ఆరంభమయ్యే రంజీ మ్యాచ్‌ తనకు చివరిదని ఆయన ప్రకటించాడు. 34 ఏళ్ల సౌరభ్‌ టీమ్‌ఇండియా తరపున 2010లో 3 వన్డేలాడి 49 పరుగులు చేశాడు. 115 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 47.51 సగటుతో 8030 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 93 మ్యాచ్‌ల్లో 1494 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. 116 లిస్ట్‌- ఎ మ్యాచ్‌ల్లో 4050 పరుగులు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్