అవినీతి నిరోధక శాఖ లోకా యుక్త బుధవారం కర్ణాటక వ్యాప్తంగా దాడులు చేపడుతోంది. 13 రాష్ట్రాల సంబంధిత అధికారులకు చెందిన 60 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరు, బిరాద్, రాంనగర్, ఉత్తర కన్నడ, ఉడిపి, కొడగు, మైసూర్, విజయపుర జిల్లాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 130 మంది లోకాయుక్త సిబ్బందితో పాటు 13 మంది పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పీలు), 12 మంది (డీఎస్పీలు), 25 మంది పోలీసు ఇన్స్పెక్టర్లు పాల్గొంటున్నారు.