రైలు ఎక్కి, దిగే సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. తాజాగా ఓ మహిళ ఇలాంటి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ మహిళ తన కుమార్తెతో పాటు రైల్లో వెళ్తుండగా.. ఆమె దిగాల్సిన స్టేషన్ ను గమనించలేదు. తీరా రైలు కదులుతుండగా గుర్తించి, తన కుమార్తెను ముందు దిగమనగా ఆమె దూకింది. తర్వాత ఆ మహిళ రైలు వెళ్ళే వైపు దిగక వ్యతిరేక దిశలో దూకడంతో ప్లాట్ ఫాం పై పడిపోయింది. ఈ ఘటన పాకిస్థాన్లో జరిగినట్లు తెలుస్తోంది.