రాజస్థాన్ చిత్తోర్గఢ్లోని కపాసన్ సబ్-డివిజన్లో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. మెవ్డా గ్రామంలో 7 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ ఎండిపోయిన బోరుబావిలో పడిపోయాడు. ఇది చూసిన బాలుడి తల్లి వెంటనే అప్రమత్తమైంది. స్థానికులకు చెప్పడంతో వారు జేసీబీ సాయంతో బాలుడిని బయటకు తీశారు. బాలుడిని సురక్షితంగా బయటకు తీసి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.