జింబాబ్వే చేతిలో భారత్ ఓటమిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ట్వీట్ వివాదస్పదమైంది. ‘T20 WC సంబురాలు ఇంకా ఆగకముందే పసికూన జింబాబ్వే చేతిలో ఓటమిపాలయ్యాం. ఇష్టం వచ్చినట్లు వ్యవహరించే బీసీసీఐకు ఇలా జరగాల్సిందే. జింబాబ్వే.. బాగా ఆడావు’ అని ట్వీట్ చేశారు. దీంతో భారత్ ఫ్యాన్స్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.