మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ గురించి ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. సునేత్రా పవార్పై తనకు చాలా గౌరవం ఉందని, ఆమె తనకు తల్లి లాంటి వారని తెలిపారు. బీజేపీకి సమర్థులైన అభ్యర్థులు లేరని, అందుకే నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. శరద్ పవార్ను దెబ్బతీయాలన్నదే బీజేపీ లక్ష్యమంటూ మండిపడ్డారు.