సుశాంత్, జాన్యా జోషి, గణేశ్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘పింటూ కీ పప్పి’. శివ హరే దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై విధి ఆచార్య దీనిని నిర్మించారు. మార్చి 21న ‘కిస్ కిస్ కిస్సిక్’ అనే పేరుతో తెలుగులో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో మూవీలోని శివోహం వీడియో సాంగ్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.