లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ భేటీ అయ్యారు. ఆయన త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరనున్నారని సమాచారం. మరోవైపు చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.