పంజాబ్‌‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్

61చూసినవారు
పంజాబ్‌‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న వేళ పంజాబ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్‌ నేత, ఎమ్మెల్యే డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ చబ్బెవాల్‌ ఆ పార్టీని వీడారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్