ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇప్పుడు అందరి కళ్లు ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ హెడ్పైనే ఉన్నాయి. హెడ్కు టీమిండియాపై వన్డేల్లో మంచి రికార్డు ఉంది. భారత్పై 9 వన్డేలు ఆడిన హెడ్ 43.12 సగటుతో 345 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 137 పరుగులుగా ఉంది. టెస్టుల్లో భారత్పై 27 మ్యాచ్లు ఆడి 46.52 సగటుతో 1163 పరుగులు సాధించాడు.