ట్రంప్ టారిఫ్ దెబ్బకి దేశంలో రొయ్యల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏపీలో రెండు రోజులుగా తగ్గుతూనే వస్తున్నాయి. శనివారం రూ. 40 తగ్గడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. 100 కౌంట్ రూ. 250 నుంచి 210కి తగ్గినట్లు తెలుస్తోంది. 30 కౌంట్ రూ. 500 నుంచి రూ. 450కి తగ్గుముఖం పట్టింది. గత పది నెలలుగా రోజు రోజుకూ ధరలు దిగజారిపోతున్నాయని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.