రాబోయే బడ్జెట్లో కర్ణాటకకు కేటాయింపుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని మోదీని సీఎం సిద్ధ రామయ్య కోరారు. ఢిల్లీలో ప్రధానితో ఆయన నిర్మాణాత్మకంగా చర్చించారని కర్ణాటక సీఎంఓ ట్వీట్ చేశారు. పెట్టుబడులు తీసుకురావడంలో చొరవ తీసుకోవాలని బెంగళూరుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. కర్ణాటక అభివృద్ధి, ప్రగతికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లు అందులో పేర్కొంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు.