కొత్త కబురు చెప్పిన సిద్ధార్థ్

573చూసినవారు
కొత్త కబురు చెప్పిన సిద్ధార్థ్
గతేడాది ‘చిన్నా’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో సిద్ధార్థ్‌. ఇప్పుడు తన 40వ సినిమాని ప్రకటించారు. శ్రీ గణేష్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ ద్విభాషా చిత్రాన్ని అరుణ్‌ విశ్వ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ ‘‘నేను ‘చిన్నా’ తర్వాత చాలా కథలు విన్నా. గణేష్‌ చెప్పిన ఈ కథ నాకు బాగా నచ్చింది. మా ఇద్దరి కలయికలో ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే సినిమా వస్తుందనే నమ్మకం నాకుంది’’ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్