చేగుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత

15964చూసినవారు
చేగుంట మండలం బోనాల కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం తిరుపతి లడ్డూ తిన్న విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది విద్యార్థులు యశ్వంత్, నిఖిల్, ప్రణయ్, కిరణ్, అజిత్ కుమార్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్