విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని ఆదివారం గ్రామ ఉప సర్పంచ్ పర్ష రాములు అన్నారు. అక్బర్ పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామ యువతీ యువకులు పదవ తరగతి పరీక్షలు బోర్డు పరీక్షకి హాజరుకానున్న నేపథ్యంలో వారికి పరీక్ష పట్ల సందేహాలు తీర్చి, దిశా నిర్దేశం చేస్తూ వారి మదిలో ఆత్మస్థైర్యాన్ని నింపి, వారికి పరీక్షకి కావలసిన పరీక్ష కిట్టు పరీక్షపాడ్, పెన్నులు, పెన్సిల్, రబ్బర్, స్కేల్ లను అందించారు.