మొదలైన రాకపోకలు...

73చూసినవారు
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద దాదాపు వారం రోజుల తర్వాత సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి. మోయ తుమ్మెద వాగుపై నిర్మించిన నూతన హై లెవెల్ వంతెన పై నుండి వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. బస్వాపూర్ వద్ద మోయ తుమ్మెద వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించడం పట్ల గ్రామస్తులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్