రూ. 2 లక్షల రుణమాఫీపై ఆమోదం తెలపడం చారిత్రాత్మక ఘట్టము

57చూసినవారు
తెలంగాణ రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీపై క్యాబినెట్ ఆమోదం తెలపడం చారిత్రాత్మక ఘట్టమని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి అన్నారు. రుణమాఫీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందనడానికి రైతురుణ మాఫీ ప్రకటనే నిదర్శనమన్నారు.

సంబంధిత పోస్ట్