భార్య పుట్టింటికి వెళ్లడంతో భర్త ఆత్మహత్య

78చూసినవారు
భార్య పుట్టింటికి వెళ్లడంతో భర్త ఆత్మహత్య
మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లికి చెందిన డప్పు కుమార్ (30) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం.. తరచూ మద్యం తాగి వస్తుండటంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 4 రోజుల క్రితం గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కుమార్ శనివారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఈ మేరకు శివంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్