ఆయనకు 80.. ఆమెకు 75.. ఇద్దరికీ పెళ్లి

50చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు(M) వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ(75), సమిడా నాయక్(80) దంపతులు 80 సంవత్సరాల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. 70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్న వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరి మనవళ్ళు, మనవరాళ్లు.. తాత, నానమ్మ పెళ్లి చేయాలని మనుమడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా పెళ్లి నిర్వహించారు. వృద్ధ దంపతుల పెళ్లి చూడడానికి తండాలోని జనం అందరూ తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్