రాళ్లకత్వలో చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

25333చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామ సమీపంలో బుధవారం ఉదయం నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొంది. 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే స్థానికులు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంతో జిన్నారం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్