ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యమైన ఘటన అమీన్పూర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో ఉంటున్న అభిలాష రెడ్డి గత నెల 22న కరీంనగర్లో ఉంటున్న చెల్లెలు అలేఖ్య వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. తరువాత ఎటువంటి సమాచారం లేకపోవడంతో పెద్దనాన్న కుమారుడు శ్యామ్ సుందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.