ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత పతక జోరు ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. పోటీలకు ఆఖరి రోజైన శనివారం సిమ్రాన్ శర్మ స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల 200 మీటర్ల టీ12 రేసును సిమ్రాన్ 24.95 సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని ముద్దాడింది. తన వ్యక్తిగత ప్రదర్శన (25.16సెకన్లు)ను మరింత మెరుగుపర్చుకుంటూ అగ్రస్థానంలో నిలిచింది.