కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో సహకార సంఘం ఆరవ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర సహకార సంఘం ఉపాధ్యక్షులు, చింతకుంట సహకార సంఘం అధ్యక్షులు న్యాలమడుగు శంకరయ్య అధ్యక్ష ఉపన్యాసం చేశారు. కార్యదర్శి సల్వాజీ తిరుపతి వార్షిక నివేదికను సమర్పించారు. ముఖ్యఅతిథిగా కరీంనగర్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు పాల్గొని మాట్లాడారు.