మన భారత దేశంలో సంపద అంతా కూడా నరేంద్ర మోడీ సంపన్నుల పాలు చేస్తూ, దేశం ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. టిజెఎస్ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి సభాధ్యక్షతన మెట్ పల్లిలోని మనోహర్ ఫంక్షన్ హాల్ లో బుధవారం పార్లమెంటు ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యకర్తలు పాల్గొన్నారు.