ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చేలా సర్కార్ పాలసీ: ఎమ్మెల్యే

83చూసినవారు
ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చేలా సర్కార్ పాలసీ: ఎమ్మెల్యే
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విధానం ఆ పరిశ్రమల ఆర్థిక పరిపుష్ఠికి ఊతమిచ్చేలా ఉందని.. మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. పారిశ్రామికరంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశంలో, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరిశ్రమల శాఖ ద్వారా నూతన పాలసీని రూపొందించడం, దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం ముదావహమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్