రంగారెడ్డి జిల్లా కన్హ గ్రామంలో జరుగుతున్న రెండు రోజుల జాతీయ మహిళ సహకార సదస్సుకు చింతకుంట గ్రామానికి చెందిన సహకార సంఘం మహిళా సభ్యురాల్లు, మహిళ డైరెక్టర్లు శనివారం పాల్గొన్నారు. ఈ సదస్సుకు దేశంలోని నలుమూలల నుంచి దాదాపు 20, 000 మంది మహిళ సహకార సభ్యులు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామం నుంచి దాదాపు 20 మంది మహిళ సభ్యులు పాల్గొన్నారు.