త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం: CM

77చూసినవారు
త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం: CM
తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ ఆయన హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఐటీఐలను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం రూ.2,324.21 కోట్ల నిధులతో కార్యచరణను సిద్ధం చేశామని అన్నారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయనున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్