స్మార్ట్ టీవీల ధరలు మరింత పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్యానెల్ ధరలు పెరగడంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని కౌంటర్పాయింట్స్ ఐవోటీ సర్వీస్ వెల్లడించింది. అయితే ప్రీమియం మోడల్స్కు దేశంలో డిమాండ్ ఉండడంతో స్మార్ట్టీవీ దిగుమతులు 9%పెరిగే అవకాశం ఉందని తెలిపింది. దేశీయంగా వినియోగిస్తున్న టీవీల్లో స్మార్ట్ టీవీల వాటా 93 శాతంగా ఉంది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది.