గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీపూర్ జిల్లా మొహమ్మదాబాద్ పట్టణంలోని కాళీబాగ్ శ్మశాన వాటికలో ఆయన సోదరుడు అఫ్జల్ అన్సారీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అన్సారీ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. జైల్లో అస్వస్థతకు గురైన ముఖ్తార్ అన్సారీని బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించగా ఆయన గుండెపోటుతో మరణించారు.