బీహార్ సంపర్క్ క్రాంతి రైలులో పొగలు..బయటకు దూకిన ప్రయాణికులు

62చూసినవారు
బీహార్ సంపర్క్ క్రాంతి రైలులో పొగలు..బయటకు దూకిన ప్రయాణికులు
బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ రైల్వే స్టేషన్‌లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో పొగలు వచ్చాయి. దీంతో మంటలు చెలరేగుతున్నాయని అరుస్తూ ప్రయాణికులు రైలు నుంచి దూకి పరుగు తీశారు. వెంటనే స్టేషన్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. రైలు ప్లాట్‌ఫారమ్‌పై నుంచి కదలగానే ఈ ఘటన జరగడంతో గమనించిన లోకోపైలెట్ వెంటనే రైలును నిలిపారు. ఆర్‌పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది స్పందించి రైలులో చెక్ చేయగా బోగీలో ఉన్న అగ్నిమాపక సిలిండర్ లీకై పొగలు వచ్చినట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్