దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం జరిగింది. ఈ క్రమంలో తూర్పు నాగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్లో విష సర్పం కనిపించింది. దీంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. నందనవన్ ప్రాంతంలోని KDKE కళాశాలలో పోలింగ్ కేంద్రానికి ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. ఆ సమయంలో పాము కనిపించింది. దానిని స్నేక్ క్యాచర్ బంధించి, నిర్మానుష్య ప్రాంతంలో వదిలాడు.