మంచు దుప్పటి.. రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు

83చూసినవారు
మంచు దుప్పటి.. రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు
దేశంలో చలి తీవ్రత మరింత పెరిగింది. దీంతో జమ్మూకశ్మీర్, లడఖ్, సిక్కిం, పశ్చిమబెంగాల్, మేఘాలయ, మణిపూర్ సహా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రైలు, విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. ఒక్క ఢిల్లీలోనే 80 రైళ్ల రాకపోకలపై పొగమంచు ప్రభావం చూపింది. ఈ రైళ్లు గంట నుంచి ఆరు గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్