ఎన్నికల సభలో ప్రసంగిస్తూ సొమ్మసిల్లిన ఖర్గే.. ఆ తర్వాత (Video)

72చూసినవారు
జమ్ముకశ్మీర్‌లోని కతువాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై మండిపడ్డారు. కాగా, మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ అస్వస్థతకు గురయ్యారు. బీపీ పడిపోవడంతో ఆయనకు కళ్లు తిరిగాయి. వేదికపై ఉన్న కాంగ్రెస్‌ నేతలు దీనిని గమనించి, ఆయనను పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్