త్వరలో.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌

50చూసినవారు
త్వరలో.. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అన్ని విధాలా అంతమొందించాలని, రాబోయే అమర్‌నాథ్ యాత్రకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను ఆదేశించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ డివిజన్‌లో ఉద్భవిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, లోయలో దాని పునరుద్ధరణను నిరోధించాలని షా భద్రతా బలగాలకు సూచించారు. కేంద్ర మంత్రి షా అధ్యక్షతన ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశంలో ఈమేరకు సూచించారు.

సంబంధిత పోస్ట్