సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త దర్యాప్తునకు ప్రత్యేక కోర్టు ఆదేశం

58చూసినవారు
సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త దర్యాప్తునకు ప్రత్యేక కోర్టు ఆదేశం
ముడా స్కామ్​ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. సీఎంపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్​పై బుధవారం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. క ర్ణాటక లోకాయుక్త మైసూరు పోలీసులు 'ముడా' స్కామ్‌పై విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ బుధవారం ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్