IPL-18లో తన తొలి పోరుకు సన్రైజర్స్ సన్నద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ ఫేవరెట్గా బరిలో దిగుతోంది. ఈ క్రమంలో బ్లాక్లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ చౌరస్తా వద్ద టికెట్లను బ్లాక్లో అమ్ముతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. సంపత్, హరి అనే ఇద్దరు యువకుల నుంచి 5 ఐపీఎల్ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు.