దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 1,808 పాయింట్ల లాభంతో 75,769 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 613 పాయింట్లు లాభపడి 23,144 దగ్గర కొనసాగుతోంది. రెండు సూచీలూ ఆరంభంలోనే రికార్డు గరిష్ఠాలను నమోదు చేయడం విశేషం. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో అన్ని షేర్లూ లాభాల్లో ఉన్నాయి.