దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 218 పాయింట్లు నష్టపోయి 74,009 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు తగ్గి 22,458 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.43 వద్ద ప్రారంభమైంది. నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, HDFC బ్యాంక్, NTPC, M&M, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.