దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609.28 పాయింట్లు క్షీణించి 73,730.16 వద్ద, నిఫ్టీ 150.30 పాయింట్లు క్షీణించి 22,420 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, M&M నష్టపోగా, టెక్ మహీంద్రా, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, BPCL షేర్లు లాభపడ్డాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకవం విలువ 83.34 వద్ద స్థిరపడింది.