ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

71చూసినవారు
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 17.39 పాయింట్ల లాభంతో 73,895.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.15 పాయింట్లు నష్టపోయి 22,442.70 వద్ద ముగిసింది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, TCS, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు రాణించగా.. టైటాన్‌, SBI, NTPC, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌ అండ్‌టీ షేర్లు నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్