యోగా గురు రామ్దేవ్ బాబాకు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతాంజలిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ ఉత్పత్తుల ప్రకటనలకు సంబంధించిన నిబంధనలను పతాంజలి ప్రాథమికంగా ఉల్లంఘించిందని పేర్కొంది. ఈ క్రమంలో పతాంజలి ఆయుర్వేద ఎండీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇతర ఔషధాల గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్ ఇతర ప్లాట్ఫాంలలో ప్రతికూల ప్రకటనలు చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేసింది.