పేపర్ల లీకేజీ వ్యవహారం కొత్త విషయం కాదని, యూపీలో ఇది పెద్ద అంశం కాగా, ఇప్పుడు ఢిల్లీకి కూడా పాకిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. కాషాయ పార్టీ తన సొంత మనుషుల మెప్పు పొందేందుకు ప్రశ్నాపత్రాలను లీక్ చేయడం చూశామని చెప్పారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది బీజేపీ తరహా లీకేజ్ అని ఎద్దేవా చేశారు. లక్షలాది విద్యార్ధుల భవిష్యత్ అంధకారంలో పడిందని దుయ్యబట్టారు.