పాకిస్తాన్లో కాంగో వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా, క్వెట్టాలో మరో కేసు నమోదైంది. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 32ఏళ్ల ఫాతిమా జిన్నాకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో కాంగో వైరస్ సోకినట్లు తేలింది. దీంతో కాంగో వైరస్ బారిన పడిన ఆమెను అదే ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో పెషావర్లో కాంగో వైరస్ బారిన పడిన 18 ఏళ్ల యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే.