తమిళనాడులోని కళ్లకురిచిలో కల్తీ మద్యం తాగి 57 మందికి పైగా మరణించారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించాలని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేక రాశారు. ఈ అంశంపై కాంగ్రెస్ మౌనం వహిస్తుందని ఆరోపించారు. ఎందుకు దీనిపై స్పందించడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.