పాకిస్థాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు చైనీయులు మరణించారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తుంక్వాలో చోటుచేసుకుంది. చైనాకు చెందిన కొందరు ఇంజనీర్లు తమ కారులో ఇస్లామాబాద్ నుంచి దాసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పేలుడు పదార్థాలతో వెళ్తున్న మరో వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. భారీ పేలుడు సంభవించి ఆరుగురు చైనీయులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.