ముంబైలోని అగ్రిపాద పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. నాయర్ హాస్పిటల్లో పనిచేస్తున్న 43 ఏళ్ల వ్యక్తి తన నివాస భవనంలోని 15వ అంతస్తు ఎక్కాడు. అక్కడి నుంచి అకస్మాత్తుగా కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని ఎదురుగా ఉన్న భవనం నుంచి కొందరు వీడియో తీశారు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.