రైలుకు ఎదురెళ్లి యువకుడి ఆత్మహత్య

14611చూసినవారు
రైలుకు ఎదురెళ్లి యువకుడి ఆత్మహత్య
విదేశీ చదువులకు వెళ్ళడానికి డబ్బులు లేక ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండలోని బతుకమ్మ చెరువు బాట సమీపంలో ఈ ఘటన జరిగింది. నల్లగొండ మండలం చందనపల్లికి చెందిన కోరదల శివమణి (20) బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతుండగా రష్యాకు వెళ్లి నర్సింగ్ చదవాలని ప్రయత్నించాడు. ఇందుకు రూ.3.5 లక్షలు అవసరం కాగా తల్లిదండ్రులు అప్పు కోసం ప్రయత్నించారు. అప్పు పుట్టకపోవడంతో మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్