ఆత్మహత్యలు సామాజిక సమస్య: సుప్రీం కోర్టు

59చూసినవారు
ఆత్మహత్యలు సామాజిక సమస్య: సుప్రీం కోర్టు
భారత్‌లో ఆత్మహత్యలు పెరగడాన్ని సుప్రీం కోర్టు సామాజిక సమస్యగా అభివర్ణించింది. ఆత్మహత్యలను నివారించడానికి ప్రజారోగ్య కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై ధర్మాసనం గురువారం స్పందించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్రాన్ని ఆదేశించింది. పెరుగుతున్న ఆత్మహత్యలను ఎదుర్కోవడానికి పటిష్ట చర్యలు అవసరమని.. దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్