మాజీ మంత్రి, BRS ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ లో చేరారు. ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ సునీత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.