MBBS, BDS.. ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)- యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ నిర్వహించనుంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు విననుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలిపింది.